సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం  అయ్యింది. ఈ మూవీ షూటింగ్ యాక్షన్స్ సన్నివేశాలతో ప్రారంభం అయ్యింది. ఈ మూవీ యాక్షన్ సన్నివేశాలలో ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా ,  ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందించ బోతున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ క్రేజీ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కిస్తున్న మూవీ లో విలన్ పాత్రను అదిరిపోయే రేంజ్ లో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు ,  అందులో భాగంగా విలన్ పాత్ర కోసం బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్నటు వంటి నటు లలో ఒకరు అయిన సైఫ్ అలీ ఖాన్ ని తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు , అందులో భాగంగా సైఫ్ అలీ ఖాన్ ను సంప్రదించి ఈ మూవీ లో నటింప చేయడానికి ఒప్పించే ప్రయత్నాలను మూవీ యూనిట్ చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఒక వేళ ఈ వార్త కనుక నిజం అయ్యి సైఫ్ అలీ ఖాన్ కనుక నిజం గానే సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ లో నటించడానికి ఒప్పుకున్నట్లు అయితే ఈ మూవీ రేంజ్ మరింతగా పెరిగిపోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: