ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో ఒక్కసారిగా మెగా అభిమానులలో నిరాశలు అలుముకున్నాయి. మళ్ళీ గట్టి కం బ్యాక్ చేయాలనీ వారు భావిస్తున్నాడు. అయితే ఇవేవీ పట్టించుకోకుండా వరుసపెట్టి సినిమాలతో ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఒకేసారి మూడు సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు. ఆచార్య సినిమా ఫ్లాప్ తాలూకు ప్రభావం ఏమాత్రం లేకుండా ఆయన ఇప్పుడు మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతూ ఉండడం విశేషం. అలా అయన చేస్తున్న మూడు సినిమాలలో ఒకటి గాడ్ ఫాదర్.  

మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్ కాగా తమిళ దర్శకుడు అయిన మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందగా ఈ సినిమాపై మెగా అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలే గాయపడి ఉన్న మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా లో ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్నాయి. ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు టీజర్ తో అభిమానుల్లో పాజిటివ్ సైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. అలా ఈ సినిమా పై మంచి అంచనాలు కలిగి ఉన్నా కూడా ఈ చిత్రానికి బజ్ లేదనే పుకారు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది.

సినిమా పై బజ్ లేదన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. భారీ ఈవెంట్ ను నిర్వహించి ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ చేయాలన్నది చిత్ర బృందం ఆలోచన.  ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం లో ఈ ఈవెంట్ ను చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా దసరా కి విడుదల అవుతుంది అని చెప్పడమే తప్పా ఎప్పుడు విడుదల అవుతుంది అన్న విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిగో అదిగో అంటూ చెప్తున్నారు తప్ప ఎప్పుడు ఈ సినిమా విడుదల తేదీ వస్తుంది ఎవరు చెప్పలేకపోయారు.  తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 5 న విడుదల కావడానికి సిద్ధమవుతుంది అని తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుంది.  ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక కు పవన్ కళ్యాణ్, సల్మాన్ ఖాన్ రాబోతున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: