టాలీవుడ్ లో నాచురల్ బ్యూటీ గా  మంచి గుర్తింపు సొంతం చేసుకున్న హీరోయిన్ లలో సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే శేఖర్ కమలా దర్శకత్వంలో వచ్చిన సినిమా ఫిదా సినిమాతో చాలామంది కుర్రకారులను తన అందంతో నటనతో బాగా ఆకట్టుకుంది..ఈమె ఫిదా తర్వాత చాలా సెలెక్టెడ్ గా సినిమాలను చేస్తూ వస్తోంది సాయి పల్లవి. సాయి పల్లవి కి ఉన్న క్రేజ్ చూస్తే పూజా హెగ్డే రష్మిక వీరిద్దరిని మించి పోవాల్సింది. ఈ అమ్మడు నేచురల్ గా ఆకట్టుకోవడానికి ట్రై చేస్తోంది. అందాల ఆరబోతతో కాదు. తను చేసే సినిమాలో పాత్ర తనకు నచ్చితేనే ఒప్పుకుంటుంది.అయితే అందుకే సాయి పల్లవి టాలీవుడ్లో ఎంట్రీ ఇంతకాలం మైనా సినిమాలు మాత్రం చాలా తక్కువగా చేసింది. 

అయితే సాయి పల్లవి చేసిన సినిమాలలో సగం అట్టర్ ఫ్లాప్ గాని నిలిచాయి.  ఆమె రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇదిలావుంటే ఇటీవల సాయి పల్లవి నటించిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి అందులో ఒకటి లవ్ స్టోరీసినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సాధించింది. ఇక ఆ తర్వాత రానా తో తీసిన విరాటపర్వం సినిమా మాత్రం అట్టర్ ప్లాప్ గా నిలిచింది. అయితే దాంతో ఎప్పటిలాగే సాయి పల్లవికి ఒక సినిమా వచ్చిన సక్సెస్ మరో సినిమా ఫ్లాప్ కావడం వల్ల అభిమానులు సైతం కాస్త నిరుత్సాహ పడుతున్నారు.అయితే దీనివల్ల సాయి పల్లవికి కొత్త సినిమాలు రావట్లేదని టాక్ వినిపిస్తోంది.. కాగా ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు సాయి పల్లవి కొత్త సినిమా ఒప్పుకోలేదని తెలుస్తోంది.

ఇక  ఈ నేపథ్యంలోనే సాయి పల్లవికి క్రేజ్ ఉందా..? లేక తగ్గిందా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే  సాయి పల్లవి వెనుక వచ్చిన ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ఆమె ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి మూడు వరుస సినిమాలుసూపర్ హిట్ కావడంతో వరుసఅవకాశాలను అందుకుంటోంది..మరి కొంత మంది మాత్రం సాయి పల్లవి తన చదువు మీద శ్రద్ధ పెట్టిందని అందుచేతనే తన సినిమాలలో తక్కువగా నటిస్తోంది అంటు వార్తలు వినిపిస్తున్నాయి..ఇక  అసలు విషయం ఏమిటంటే మాత్రం సాయి పల్లవి ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: