పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందవలసి ఉంది. కానీ ఆ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులే అయిపోతుంది. అయినా కూడా ఇప్పటిదాకా ఆ సినిమాను మొదలు పెట్టకపోవడం ఈ సినిమా అభిమానులను నిరాశ పరుస్తుంది. చాలా రోజులుగా ఈ సినిమా రేపు మాపో రాబోతుంది అనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్న కూడా దానికి సంబంధించిన షూటింగ్ మొదలు కాకపోవడం నిజంగా పేక్షకులకు సైతం ఎంతగానో నిరాశ పరుస్తుంది.

ఆ విధంగా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కోసం ఇకపై వెయిట్ చేయకుండా మరో హీరో తో సినిమా చేసే విధంగా ముందుకు వెళుతున్నాడని అంటున్నారు. తొందరలోనే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఓ సినిమాకు దర్శకుడుగా ఆయన వ్యవహరించ బోతున్నాడు అని చెబుతున్నారు. అయితే తాజాగా పవన్ హరిహర వీరమల్లు సినిమాకు 50 రోజుల డేట్స్ కేటాయించడం జరిగింది.  మరి ఎందుకు హరీష్ శంకర్ సినిమాను పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు అనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. క్రిష్ సినిమా గురించి ఆలోచించిన ఆయన హరీష్ శంకర్ సినిమా ను చేస్తాడా అన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.

చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ సినిమాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రూపొందించి విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ ఆలోచన. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఎంతటి స్థాయిలో .విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి హరీష్ శంకర్ సినిమాను పవన్ కళ్యాణ్ అసలు చేస్తాడా లేదా అన్నది ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పుడు వస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: