మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసింది . భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఆచార్య మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరస మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి , బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తూ ఉండగా , ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించబోతుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో మాస్ మహారాజ రవితేజ కూడా కనిపించ బోతున్నాడు.

ఇప్పటి వరకు ఈ మూవీ కి అధికారికంగా మూవీ యూనిట్ టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడంతో ,  ఈ మూవీ చిరంజీవి కెరియర్ లో 154 మూవీ గా తెరకెక్కుతూ ఉండడంతో , ఈ మూవీ షూటింగ్ మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తాజా షెడ్యూల్ రేపటి నుండి అనగా సెప్టెంబర్ 21 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ తాజా షెడ్యూల్ లో విలేజ్ సన్నివేశాల చిత్రీకరణ కోసం మెగా 154 టెం4 రాజమండ్రి కి వెళ్లనుంది.  రేపటి నుండి రాజమండ్రి లో జరగబోయే షెడ్యూల్ లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: