స్వర్గీయ నటి శ్రీదేవి కూతురు జాన్వీ గురించి తెలిసిందే.. అమ్మడు సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే..మొదటి సినిమాతో పాపులర్ అయ్యింది. మొత్తానికి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసే ఛాన్స్  ను అందుకుంది.ఇక తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది.సోషల్ మీడియాలో జాన్వీ ఎక్కువ చురుగ్గా వుంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ బిజిగా వుంటుంది..ఇది ఇలా ఉండగా..జాన్వీ ఇటీవల కరణ్ జోహార్ టాక్ షో కాఫీ విత్ కరణ్‌లో పాల్గోన్నసంగతి తెలిసిందే..


ఈ సందర్భంగా ఈ భామ చేసిన కొన్ని వ్యాఖ్యలు దూమరానికి దారితీయడంతో సారీ చెప్పింది. వివరాల్లోకి వెళితే.. ఈ భామ హిందీ సినీ ఇండస్ట్రీలో నెపోటిజంపై వ్యంగ్యంతో కూడిన కొన్ని కామెంట్స్‌ చేసింది. అయితే ఆ తర్వాత ఆమెపై సోషల్‌మీడియాలో విమర్శలు రావడంతో తన మాటల్ని వెనక్కు తీసుకుని సారీ చెప్పింది...కాఫీ విత్‌ కరణ్‌' షోలో జాన్వీ.. ఓ ప్రశ్నకు సమాధానంగా.. సోదరుడు అర్జున్‌కపూర్‌తో ఓ సినిమా తీస్తానని, దానికి 'నెపోటిజమ్‌' అనే పేరు పెడతానంటూ ఓ కామెంట్ చేసింది. జాన్వీ సరదాగా చేసిన కామెంట్‌పై నెటిజన్స్ తీవ్రంగా రియాక్ట్ అవ్వుతున్నారు. జాన్వీ మాటలు పరోక్షంగా నెపోటిజంను ప్రోత్సహించేలా ఉన్నాయని తిట్టి పోశారు.


ఆ తర్వాత జాన్వీకపూర్‌ చివరకు సారీ చెప్పి.. వివాదానికి ముగింపు పలికింది. ఇక ఈ భామ నటించిన లేటెస్ట్ సినిమా గుడ్ లక్ జెర్రీ ప్రస్తుతం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జాన్వీకపూర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నటనతో తల్లికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకుంటున్నారు..ఈ అమ్మడు ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ సూపర్ బిజీగా ఉన్నారు. ఇక అది అలా ఉంటే శ్రీదేవి రెండో కూతురు ఖుషీకపూర్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఖుషి.. జోయా అక్తర్  తెరకెక్కిస్తున్న ది ఆర్చీస్తో ఎంట్రీ ఇస్తున్నారు. విజయ్‌తో జాన్వీ అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కానీ రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి సినిమాతో ఈమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక శ్రీదేవి కూడా తెలుగు సినిమాల్లో నటించే నార్త్‌లో పాగా వేసింది. తల్లి అడుగుజాడల్లో కూతురు నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: