గతంలో పవన్ కల్యాణ్, అనుష్క శెట్టి హీరో, హీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఓ సినిమాను ప్లాన్ చేశారు. ఇక జీసస్ జీవితం చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేశారు.అయితే ఈ సినిమా కోసం అనుష్క, పవన్ సంతకాలు కూడా చేశారు.ఇక  ఈ చిత్రంలో అనుష్కను దేవదూతగా చూపించాలని సింగీతం ప్రయత్నం చేశారు. అనుష్క అరుంధతి చిత్రంలో ఆమె చేసిన పాత్ర చూసిన ఆయన ఈ సినిమాలో ఎంపిక చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాకు 'ప్రిన్స్ ఆఫ్ పీస్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీలో పవన్ కల్యాణ్ ను ఆర్కిటెక్ గా చూపించాలి అనుకున్నారట. కాగా కొండా కృష్ణంరాజు నిర్మాతగా ఈ సినిమా తెర మీదకు వచ్చింది.ఇకపోతే ఈ ప్రతిష్ట్మాత్మక చిత్రాన్ని అప్పట్లోనే తెలుగు, హిందీ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించాలని భావించారు.

ఇక  ఇందులో భాగంగా సినిమా యూనిట్ జెరూసలేంలో పర్యటించింది.అంతేకాదు  జీసెస్ చరిత్రకు సంబంధించిన పలు విషయాలను పరిశీలించింది.పవర్ స్టార్  పవన్ కళ్యాణ్, సింగీతం కలిసి జోర్డాన్ వెళ్లి మరీ లొకేషన్స్ చూసి ఫైనలైజ్ చేసుకున్నారు. ఈ సినిమాకి జె.కె.భారవి, సింగీతం శ్రీనివాసరావు, కొండా కృష్ణంరాజు సంబంధించి రెండేళ్ల పాటు కథను తయారు చేసారట. అన్నీ ఓకే అయి సినిమా సెట్స్ మీదకు పోతుంది అనుకున్న తరుణంలో చిత్రం ఆగిపోయిందనే ప్రకటన వచ్చింది. ఇక ఈ సినిమా ఆగిపోవడానికి ప్రధాన కారణం బడ్జెట్.అయితే  ముందుగా అనుకున్న బడ్జెట్ కన్నా చాలా ఎక్కువ అవుతోందని తేలిందట. ఇక దీంతో సింగీతం, కృష్ణం రాజు కలిసి సినిమా ఆపేయాలనే నిర్ణయానికి వచ్చారట.ఇకపోతే కొంత కాలం క్రితం ఈ సినిమాకు సంబంధించి సింగీతం శ్రీనివాసరావు కీలక విషయాలు వెల్లడించారు.

ఇక  ఈ సినిమాకు సంబందించి తను కేవలం ప్రెస్ మీట్ మాత్రమే పెట్టానని చెప్పారు. "వాస్తవానికి సినిమా షూటింగ్ ఇంకా మొదలు పెట్టలేదు. అయితే జెరుసలేంలో ప్రెస్‌మీట్ పెట్టాం అంతే. తొలి షెడ్యూల్ అయిపోయింది, రెండో షెడ్యూల్ అయిపోయింది అని వార్తలొచ్చాయి.ఇక  వాటి గురించి నాకైతే తెలీదు" అన్నారు. ఈ సినిమాలో పవన్ ది గెస్ట్ రోల్ అని చెప్పారు. ఇక తాము జీసెస్ కథ ఆధారంగా సినిమా చేయాలనుకున్నామని చెప్పారు.  సినిమా కోసం జీసస్‌కి సంబంధించిన చాలా పుస్తకాలు చదివినట్లు చెప్పారు. అంతేకాదు చివరకు బైబిల్ కూడా చదివినట్లు వెల్లడించారు. ఇక ఈ సినిమా పుణ్యమా అంటూ క్రీస్తు పుట్టిన బెత్లహాంకు వెళ్లామన్నారు...దీంతో పాటు ప్రశాంతత అంటే ఏంటో అక్కడ తనకు తెలిసిందన్నారు. బడ్జెట్ సహకరించకనే ఈ సినిమా నిర్మాణాన్ని ఆపేసినట్లు సింగీతం వెల్లడించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: