తెలుగు సినిమా పరిశ్రమలో క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకుడు పరుశురామ్ ఇటీవల మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమాకు దర్శకత్వం వహించి ఒక మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సరికొత్త కాన్సెప్ట్ గా రూపొందిన ఈ సినిమాను ఇంతటి స్థాయిలో విజయం అందుకునేలా చేయడంలో ఈ దర్శకుడి పాత్ర ఎంతో ఉందని చెప్పవచ్చు. ఒక పెద్ద హీరోతో చేసిన తర్వాత ఈ దర్శకుడికి తప్పకుండా భారీ సినిమా అవకాశాలు వస్తాయని ప్రతి ఒక్కరు కూడా భావించారు.

కానీ సర్కారు వారి పాట సినిమా తరువాత ఈ దర్శకుడు ఎవరితో సినిమా చేస్తున్నాడో అన్న క్లారిటీ ఇప్పటిదాకా రాకపోవడం కొంతమందిని ఆశ్చర్యపరుస్తుంది. అంత పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టిన హీరోకి సైతం ఇలాంటి పరిస్థితి ఏర్పడడం నిజంగా దురదృష్టకరం అనే చెప్పాలి. మొన్నటిదాకా ఈ దర్శకుడు నాగచైతన్యతో ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు నాగచైతన్య ఈ దర్శకుడు తో చేయడానికి సముఖంగా లేని నేపథ్యంలో పరశురాం ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తాడు అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది.

త్వరలోనే పరశురాం తదుపరి సినిమా యొక్క క్లారిటీ ఇవ్వబోతున్నాడు. ఒక పెద్ద హీరోతోనే ఆయన సినిమా చేసే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నాడు. మరి ప్రతిభ పరంగా మంచి గుర్తింపు కలిగి ఉన్న ఈ దర్శకుడు తన సినిమాలపై కొంత దృష్టి పెట్టి దానిని ప్రేక్షకులకు నచ్చే విధంగా చేసే తప్పకుండా భవిష్యత్తులో పెద్ద దర్శకుడు అయ్యే అవకాశం లేకపోలేదు. ఆయన తొలి సినిమా సోలో ఆ తర్వాత చేసిన శ్రీరస్తు శుభమస్తు గీత గోవిందం వంటి సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. క్లాసు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ విధంగా మాస్ ప్రేక్షకులను దృష్టిలో పడాలని చేసిన సర్కారు వారి పాట ఆయన కెరీర్ లో బెస్ట్ సినిమాగా చెప్పుకోవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: