తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికీ ఈ మొబైల్స్ 39 సంవత్సరాలు అయిన యువ హీరోయిన్లకు దీటుగా నటిస్తూ ఉన్నది.
అయితే తాజాగా త్రిష పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటిస్తున్నది . ఈ సినిమా షూటింగ్ కూడా గత కొద్ది రోజుల క్రితమే పూర్తి చేసుకున్నది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం అందరూ బిజీగా ఉన్నారు. ఇందులో ఐశ్వర్యరాయ్ విక్రమ్ ,కార్తి ,జయం రవి ,శోభిత ధూళిపాళ్ల నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇక ఈ సినిమా కథ మొత్తం చోళ రాజ్యానికి సంబంధించినది.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ త్రిష కూడా పాల్గొనడం జరిగింది . అందులో భాగంగానే ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియజేసింది . ఈ సినిమాలో మీరు ధరించిన నగలన్నీ నిజమైనవేనా అని అడగగా.. అందుకు త్రిష మాట్లాడుతూ.. ముఖ్యంగా ఈ సినిమాలలో నటించడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేసింది. ఈ చిత్రంలో తాను చోళదేశపు రాజకుమారి కుందవై పాత్రలో నటించానని తెలిపింది.

అయితే ఈ సినిమాలో తాను ధరించిన నగలన్నీ నిజమైనవే అని తెలియజేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో తన పాత్ర చాలా సహజంగా ఉంటుందని అందుచేతనే తాను చోళ రాకుమారిగా కనిపించనున్నానని తెలిపింది.
నేను పోషించిన ఈ కుందమై పాత్ర పట్ల చాలా శ్రద్ధ కూడా తీసుకున్నానని.. ఆనాటి రాజుల యొక్క ఆహారం వారు వేసుకుని దుస్తులు నగలను కూడా ఎంపిక చేశారని తెలిపింది. అలా కొన్ని సన్నివేశాలలో .. తాను నిజమైన నగలనే ధరించానని తెలియజేసింది త్రిష. అయితే ఈ సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా మణిరత్నం గారి సినిమాలో భాగం కావడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఈ చిత్రం దాదాపుగా రూ.500 కోట్ల రూపాయలు బడ్జెట్ తో నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: