సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు ,  ఖలేజా మూవీ లు తెరకెక్కయి. ఈ రెండు మూవీ లు కూడా ప్రేక్షకులను బాగానే అలరించాయి. దానితో ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన రెండు మూవీ లు కూడా ప్రేక్షకులను బాగా అలరించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తేరకెక్కుతున్న మూడవ మూవీ పై మహేష్ బాబు అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ మూవీలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇది వరకే మహేష్ బాబు ,  పూజా హెగ్డే కాంబినేషన్ లో మహర్షి మూవీ తెరకెక్కి మంచి విజయం సాధించింది. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా తెరకెక్కుతుంది. ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ మూవీ షూటింగ్ ని యాక్షన్ సన్నివేశాలతో చిత్ర బృందం ప్రారంభించింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది.

ఇది ఇలా ఉంటే వచ్చే నెల 10 వ తేదీ నుండి మహేష్ బాబు 28 వ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ షెడ్యూల్లో మహేష్ బాబు తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సర్కారు వారి పాట మూవీ తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావడం , అలా వైకుంఠపురంలో మూవీ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: