నందమూరి నటసింహం బాలకృష్ణ కొన్ని రోజుల క్రితం ఆహా  'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ఆన్ స్టాపబుల్ అనే ఒక టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించిన విషయం మన అందరికీ తెలిసిందే . బాలకృష్ణ తన కెరియర్ లో మొట్ట మొదటి సారి టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిం చినప్పటికీ తన మొట్ట మొదటి టాక్ షో తోనే బాలకృష్ణ  ప్రేక్షకులను అద్భుతంగా అలరించాడు . దానితో అన్ స్టాపబుల్ సీజన్ 1 టాక్ షో అద్భుతమైన సక్సెస్ సాధించడంతో ఆహా  'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ ఈ టాక్ షో కు సీజన్ 2 ను కూడా ప్లాన్ చేసింది . ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఆహా  'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ విడుదల చేసింది . 

మరి కొన్ని రోజుల్లోనే ఆన్ స్టాపబుల్ సీజన్ 2 టాక్ షో ప్రారంభం కాబోతోంది . ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ టాక్ షో సీజన్ 2 దసరా పండుగ సందర్భంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు ,  లేక పోయినట్లు అయితే అక్టోబర్ రెండవ వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ టాక్ షో కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  ఆన్ స్టాపబుల్ సీజన్ 2 లో భాగంగా ఏదో ఒక ఎపిసోడ్ కి ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గెస్ట్ గా రానున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: