ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు రూపొందుతున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరో గా పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న ప్రభాస్ ఆ తర్వాత బాహుబలి సినిమా తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు అందుకున్నాడు. అలా ఆ సినిమా తర్వాత అయన చేసిన రెండు సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోకపోవడం నిజంగా అభిమానులను నిరాశపరిచింది. ఇప్పుడు చేస్తున్న సినిమాలలో ముందుగా ప్రేక్షకుల ముందుకు ఆది పురుష్ చిత్రం విడుదల కాబోతుంది. ఓం రౌత్ దర్శకత్వం అందించిన ఈ సినిమా ను బాలీవుడ్ లో రూపొందిచగా ఈ సినిమా యొక్క చివరి దశ పనులను జరుపుకుంటుంది చిత్ర బృందం. కృతి సనన్ హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించగా ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విజయం ఈ సినిమాతో తప్పకుండా వస్తుందని వారు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఇప్పుడు మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేస్తామని యూనిట్ ప్రకటించగా దానికి సంబంధించి పోస్టర్ ను ఈ రోజు విడుదల చేసింది. దానిద్వారా మంచి బజ్ ని క్రియేట్ చేసింది చిత్ర యూనిట్. అక్టోబర్ 2 న ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతుంది.  బాహుబలి సినిమా తర్వాత రెండు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ హీరో వాటి ద్వారా మంచి ఫలితాలను అందుకోలేదని చెప్పాలి. ప్రేక్షకులను ఎంతగానో నిరాశ పరుస్తున్న ఆయన సినిమాలు ఇప్పుడు తప్పకుండా మంచి విజయాలను అందుకుంటాయని అందరూ భావిస్తున్నారు.

అయితే ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల కోసం ప్రభాస్ ఏకంగా నెలరోజుల సమయాన్ని కొటాయించడం ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరుస్తుంది.  ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలను కూడా ఆయన చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే చిత్రాన్ని ఇప్పటికే మొదలుపెట్టిన ఈ హీరో ఇంకొక వైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమాను కూడా షూటింగ్ చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో సినిమా కూడా  రూపొందుతుంది. అంతేకాకుండా ఈ హీరో మరో ఇద్దరు భారీ దర్శకులతో భారీ భారీ సినిమాలను కూడా చేయబోతున్నాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: