టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికి ఈ సినిమా పైన కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నారని చెప్పవచ్చు.ఇదిలావుంటే ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా పలు రూమర్స్ చాలా వైరల్ గా మారుతున్నాయి. సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే విషయంలో అటు హీరోయిన్ విషయంలో పలు రూమర్స్ వెలుబడుతూనే ఉన్నాయి. ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే చిత్ర బృందం మాత్రం ఈ రూమర్స్ కు ఎలాంటి బ్రేక్ వేయలేదు.ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ కూడా తెలపలేదని చెప్పవచ్చు.

ఇకపోతే ఇప్పుడు తాజాగా మళ్లీ హీరోయిన్ విషయంలో మరొక వార్త వైరల్ గా మారుతోంది అదేమిటంటే బాలీవుడ్ హీరోయిన్ కోసం పలు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకొని సౌత్ హీరోయిన్ కి ఫిక్స్ అయినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.ఇక  బాలీవుడ్ హీరోయిన్ ఎవరు ఈ సినిమాలో నటించేందుకు ముందుకు రాలేకపోవడంతో పాటు.. రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎక్కువగా అడగడంతో సౌత్ హీరోయిన్ కి ఈ చిత్రంలో అవకాశాన్ని ఇచ్చే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.అయితే ముందుగా ఈ సినిమాలో ఆలియా భట్ నటిస్తుందనుకున్నారు..

కానీ పలు కారణాల వల్ల ఆమె నటించలేదు ఇక ఆ తర్వాత రష్మిక, మృణాల్ ఠాగూర్, జాన్వి కపూర్ తదితర పేర్లు వినిపించాయి. ఇప్పుడు తాజాగా సౌత్ హీరోయిన్ ఆయన మహానటి హీరోయిన్ ఈ సినిమాలో నటించబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ చిత్రంలో ఈమె ప్రాధాన్యత చాలానే ఉంటుందని ముఖ్యంగా నటనకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండడం చేత కీర్తి సురేష్ కూడా ఈ సినిమాని ఒప్పుకునే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.  అంతే కాకుండా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో కాకోకుండా కేవలం సౌత్ ఇండియాలోనే ఈ సినిమాని తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.  అన్ని విషయాలకు చిత్ర బృందం ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: