టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీకి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.అంతేకాకుండా  ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.ఇదిలావుంటే  ఇప్పుడు ఈ కు సిక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే పార్ట్ 1 కంటే పార్ట్ 2 పై అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం సెకండ్ పార్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతేకాదు త్వరలోనే ఈ మూవీ చిత్రీకరణలో హీరోయిన్ రష్మిక కూడా పాల్గొననుంది. 

అయితే ఇక  ఈ  సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక  ఇప్పటికే ఇందులో సాయి పల్లవి, విజయ్ సేతుపతి కీలకపాత్రలలో కనిపించనున్నట్లు రూమర్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఇదిలావుంటే ఇక తాజాగా మరో క్రేజ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తుంది.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ లో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ అతిథి పాత్రలో కనిపించనున్నారట. ఇక ఇప్పటికే అతడితో చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో మరో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందని..

ఇక  ఈ రోల్ కోసం ముందుగా విజయ్ సేతుపతిని అనుకున్నారని.. ఇక చివరి నిమిషంలో అర్జు్న్ కపూర్‏ను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా లో అల్లు అర్జున్ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో అదరగొట్టారు. ఇక ఈ మూవీతో బన్నీతో పాటు హీరోయిన్ రష్మికకు సైతం పాన్ ఇండియా క్రేజ్ వచ్చేసింది.దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మరో హైలెట్ అనే చెప్పుకోవాలి.అంతేకాదు ఈ సినిమా లోని ప్రతి సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేశాయి.కాగా  ఇక స్టార్ హీరోయిన్ సమంత సైతం స్పెషల్ సాంగ్ లో మెప్పించింది.అయితే  ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇకపోతే  ఇప్పుడు రూపొందుతున్న పుష్ప 2పై భారీగా అంచనాలున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: