హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ తెలుగులో సక్సెస్ ఫుల్ నటి గా అనిపించుకోలేకపోయింది.


ఎందుకంటే ఆమె నటించిన సినిమాలు హిట్ అయి నా కానీ పెద్దగా అవకాశాలను దక్కించుకోలేకపోయింది. అయితే,ప్రగ్యా కెరీర్ ముగిసిపోవడానికి ఇండస్ట్రీలోని కొందరు దర్శకులే కారణం అని తెలుస్తోంది. ప్రగ్యా జైస్వాల్ తెలుగులో కంచె మూవీ ద్వారా పరిచయమైన సంగతి తెలిసిందే. దీనికి క్రిష్ దర్శకత్వం వహించాడు. హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ తెలుగులో నటించిన సినిమాలు కమర్షియల్ హిట్స్ అందుకుంది.


అందులో తన డెమ్యూ మూవీ కంచె ఉండగా.. రీసెంట్‌గా అఖండ మూవీలో నటించి భారీ సక్సెస్ అయితే అందుకుంది. యాభై ఏళ్ల వయస్సున్న బాలయ్య బాబుతో నటించిన ప్రగ్యా.. తన తండ్రి వయస్సున హీరోల తో నటించడమే తప్పని కొందరు అంటున్నారట.. ప్రగ్యా తనకంటే వయసులో పెద్ద హీరోలతో నటించి తన కెరీర్ పాడుచేసుకుందని కొందరు అయితే అంటున్నారు. ఎందుకంటే ముసలి హీరోలతో కలిసి నటించడమే ఆమె చేసిన తప్పు అని అనేవారు కూడా లేకపోలేదు.




ప్రగ్యాజైస్వాల్ ఇతర భాషల్లో అవకాశాలు దక్కించుకున్నా తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాకపోవడానికి దర్శకులు కూడా కారణం అని తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రగ్యా నటించిన సినిమాల్లో దర్శకులు ఆమెకు ప్రాధాన్యత లేని క్యారెక్టర్స్ ఇవ్వడమే కారణం అని కూడా కొందరు అంటున్నార ట.కంచె దర్శకుడు క్రిష్, అఖండ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్,ఆచారి అమెరికా యాత్ర, జయ జానకి నాయక వంటి సినిమాల్లో దర్శకులు ప్రగ్యాకు సరైన రోల్ ఇవ్వకపోవడం వలన కూడా తన కెరీర్ ముగిసిపోవడానికి కారణం అని ఇండస్ట్రీలో టాక్ అయితే నడుస్తోంది. అయితే కొత్తగా వచ్చే అందమైన హీరోయిన్ ల తాకిడి తట్టుకొని నిలబడటం కొద్దిగా కష్టమే అని చెప్పాలి. పాత అందాలు చూసి వారికీ బోర్ కొట్టేస్తుంది.అందుకే దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు అయితే ఇవ్వడం కష్టంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: