మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి మొదట ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా అక్టోబర్ 5 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ థియేటర్ లలో విడుదల అయింది.

మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి టాక్ లభించడంతో ప్రస్తుతం ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా మెగాస్టార్ రెండు మూవీ లలో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భోళా శంకర్ మూవీ ఒకటి కాగా ,  బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఒకటి. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో దొరకెక్కుతున్న  మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ కి ఇప్పటి వరకు టైటిల్ ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించ లేదు.

దానితో ఈ సినిమా చిరంజీవి కెరియర్ లో 154 మూవీ గా తెరకెక్కుతూ ఉండడంతో ఈ మూవీ మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ ను జరుపుకుంటుంది. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇది వరకే ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. కాకపోతే విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని 11 జనవరి 2023 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మరి కొద్ది రోజుల్లో అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: