స్టార్ హీరోయిన్ సమంత ముఖ్యమైన పాత్రలో నటించిన తాజా చిత్రం యశోద. ఈ సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాకుతో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా బాగానే రాబడుతున్న ఈ చిత్రం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా వస్తువులను రాబట్టినట్లు సమాచారం. ఇక ఈ సినిమా హిట్ అవ్వడంతో ఈ సినిమా సీక్వెల్స్ కూడా వస్తాయంటూ మేకర్ ఇటీ వలె తెలియజేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న చిత్ర బృందం యశోద 2 గురించి చాలామంది అడుగుతున్నారు కానీ ఈ సీక్వెల్స్ ప్రయత్నం మాత్రం దర్శకులు హరి, హరి శంకర్ నుంచి రావాలని నిర్మాత శివ లంకె కృష్ణ ప్రసాద్ తెలియజేయడం జరిగింది.


యశోద సినిమా సీక్వెల్ విషయంలో మాకు ఒక ఐడియానే ఉంది. సెకండ్ పార్ట్ ,థర్డ్ పార్ట్ కూడా తమ దగ్గర కథలు ఉన్నాయని.. అయితే సమంత గారి పైన ఇది ఆధారపడిందని దర్శకులు తెలియజేయడం జరిగింది. సమంత పూర్తిగా ఆరోగ్యంగా తిరిగి కోల్కున్న తర్వాతే ఆవిడతో ఇలాంటివన్నీ డిస్కషన్ చేసిన తర్వాత సమంత ఒప్పుకుంటే సీక్వెల్ కచ్చితంగా చేస్తామని తెలియజేశారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై యశోద సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలకమైన పాత్రలో నటించింది.


ప్రస్తుతం సమంత ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఎన్నో సినిమా షూటింగులు కూడా వాయిదా పడడం జరుగుతోంది. ఇక సమంత తనకి ఆరోగ్యం బాగా లేకపోయినా సరే తన సినిమాలకు తానే డబ్బింగ్ చెబుతూ ఉంది. ప్రస్తుతం సమంత చేతిలో శాకుంతలం, ఖుషి వంటి సినిమాలు ఉన్నాయి. త్వరలో ఈ సినిమాలు కూడా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి సమంత త్వరగా ఆరోగ్యంగా బయటికి రావాలని అభిమానుల సైతం కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: