విజయ్ దళపతి హీరోగా నటించిన వారసుడు సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అవ్వడానికి సిద్ధమవుతుంది. 11 రోజులుగా ఈ సినిమా యొక్క విడుదలపై అందరిలో ఎంతో సంశయం నెలకొనగా ఫైనల్ గా దిల్ రాజు ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సిద్ధమైపోయాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా యొక్క బిజినెస్ ఏ స్థాయిలో ఉంటుందో అన్న అంచనాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా యొక్క బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది అని చెబుతున్నారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా తమ న్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. దాదాపు 100 కోట్ల పారితోషకాన్ని విజయ్ దళపతికి అందజేసిన దిల్ రాజు దానికి తగ్గట్లుగానే ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ను చేయ డం జరిగింది అని తెలుస్తుంది. అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు టేబుల్ ప్రాఫిట్ ముందే వచ్చిందని అంచనా వేస్తున్నారు.

ఏదేమైనా విడుదల తర్వాత ఆయనకు ఈ సినిమా భారీ లాభాన్ని చేకూరుస్తాయని అంటున్నారు. దిల్ రా జు సినిమాలు చేసే విషయంలో ఎంతో క్లారిటీగా ఉంటాడు. అందుకే ఆయన ఇన్ని సంవత్సరాలు సినిమాలను చేస్తూ వచ్చారు. ఒకటి రెండు సినిమాలు ప్లాప్ అయినా కూడా పెద్ద సిని మాల ద్వారా ఎక్కువ లాభాన్ని గడించి ఆయన అగ్ర నిర్మాతగా ఎదిగారు. ఈ విధంగా ఇప్పుడు ఈ వారసుడు సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరగడం మంచి విషయం అనే చెప్పాలి. ఒక తమిళ హీరోతో కలిసి తెలుగు దర్శక నిర్మాతలు చేస్తున్న ఈ ప్రాజెక్టు పై మొదటి నుంచి ఎన్నో అవమానాలు పడ్డారు. మరి ఈ సినిమాకు ఇంతటి స్థాయిలో బిజినెస్ జరగడం వారికి మంచి విషయం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: