నందమూరి నట సింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం విడుదల అయిన అఖండ మూవీతో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా అఖండ మూవీ తో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండగా , దునియా విజయ్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. కాకపోతే వీర సింహా రెడ్డి మూవీ ని ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం మూవీ యూనిట్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వీర సింహా రెడ్డి మూవీ యూనిట్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఆల్మోస్ట్ కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 14 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా నుండి మొదటి పాటను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ పై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: