నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీర సింహారెడ్డి  మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని దర్శకుడు గోపీచంద్ మలినేని పవర్ ఫుల్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా  ,అందులో బాలకృష్ణ పవర్ఫుల్ గా కనిపించడంతో , ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. బాలకృష్ణ సరసన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దునియా విజయ్మూవీ లో విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా , తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదలకు ఇంకా ఎక్కువ రోజులు లేకపోవడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ ను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ నుండి మొదటి సాంగ్ విడుదల తేదీకి సంబంధించిన అప్డేట్ ను ఈ రోజు మూవీ యూనిట్ విడుదల చేసే అవకాశం ఉంది అని ఒక వార్త వైరల్ అవుతుంది. అలాగే ఈ మూవీ నుండి మొదటి సాంగ్ అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై బాలకృష్ణ అభిమానులు అత్యంత భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: