సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటిది ఇప్పుడు రెండు సినిమాలు ఒకే సారి వస్తున్నాయి.ఇక అది కూడా సంక్రాంతికి. బాలయ్య వీరసింహారెడ్డి అని వస్తుంటే.. చిరంజీవి వాల్తేరు వీరయ్య అని వస్తున్నాడు.అయితే  ఇప్పటి వరకు వదిలిన స్టఫ్ చూస్తుంటే రెండూ కూడా మాస్‌కు పూనకాలు తెప్పించేలానే ఉన్నాయి.ఇక  బాలయ్యది పవర్ ఫుల్‌గా ఉంటే.. చిరంజీవిది మాస్, గ్రేస్, స్టైల్ అన్నీ కలిపి ఉన్నాయి. కాగా ఇలా ప్రతీ విషయంలో జనాలు ఈ రెండు సినిమాలను, 

బాలయ్య చిరులను కలిపి తేడాలే గమనిస్తున్నారు.ఇక ఇలాంటి సమయంలో చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే పాట వచ్చింది. అది తేడా కొట్టేసింది.ఇకపోతే  దేవీ శ్రీ ప్రసాద్‌ను జనాలు ఆడేసుకుంటున్నారు.ఇప్పుడు బాలయ్య వీరసింహారెడ్డి నుంచి మొదటి పాట రానుంది.దీనిపై గోపీచంద్ వేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ఇక ఈ రెండు సినిమాలను నిర్మించింది మైత్రీనే. అయితే ఈ రెండింటిని ఒకే సారి తీసుకురావడానికి గట్టిగానే ప్లాన్ చేసినట్టుంది. అందుకే అటూ ఇటూ ప్రమోషన్స్ బ్యాలెన్స్ చేస్తోంది.ఇకపోతే అక్కడొక పాట.. ఇక్కడొక పాట.. అక్కడొక పోస్టర్.. ఇక్కడొక పోస్టర్ అంటూ బ్యాలెన్స్ చేస్తోంది. 

ఇప్పుడు గోపీచంద్ పెట్టిన మంటలు చల్లారేలా లేవు.ఇక  నిన్ను తాకే దమ్మునొడు లేనే లేడయ్యా అంటూ జై బాలయ్య మాస్ ఆంథమ్ అంటూ పాటకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు.అయితే  దీంతో ఆ ట్వీట్ మీద మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దారుణాతి దారుణంగా తిడుతూ ట్వీట్లు పెడుతున్నారు. ఇక ఇప్పుడు నందమూరి మెగా అభిమానుల మధ్య తిట్ల పురాణమే వైరల్ అవుతోంది.అయితే ఇంతలా నెటిజన్లు తిట్టేసుకుంటే గోపీచంద్ మాత్రం ఓ నెటిజన్‌కు పర్సనల్‌గా రిప్లై ఇచ్చినట్టు కనిపిస్తోంది.ఇక  అది పాటలోని లిరిక్.. ప్లీజ్ నెగెటివ్‌గా ఉండకండి అంటూ నెటిజన్‌ను వేడుకున్నాడు. అయితే ఈ ఒక్క ట్వీట్‌తోనే ఇలా ఉంటే.. మున్ముందు ఎన్ని ఫ్యాన్ వార్స్ జరుగుతాయో.. ఎన్ని గొడవలు జరుగుతాయో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: