సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎన్నో గాసిప్స్. ఇప్పుడే కాదు.. పాత కాలం నుంచి కూడా అది ఉన్నదే. అయితే.. ఒకప్పటి సీనియర్ హీరోలు కూడా చాలా కలుపుగోలుగా ఉండేవారు.

వాళ్లకు పెద్దగా ఈగో, ఆటిట్యూడ్ అయితే ఉండేది కాదు. కానీ.. ఈ తరం హీరోల రూటే సపరేటు. వాళ్లకు చాలా ఈగో ఉంటుంది. అందరు అలా ఉంటారని చెప్పలేం కానీ.. కొందరు మాత్రం తమ ఆటిట్యూడ్ ను అయితే చూపిస్తుంటారు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. వాళ్లను వాళ్లు మెగాస్టార్ రేంజ్ లో ఊహించుకుంటారు. పారితోషికాలు పెంచుతారు. హీరోయిన్లు ఇబ్బంది పెడతారు..

ఇలా చాలా రకాలుగా ఉంటుంది వాళ్ల ఆటిట్యూడ్. అయితే.. ఇప్పుడు మనం మాట్లాడుకునేది డీజే టిల్లు సిద్ధూ గురించే. అవును.. డీజే టిల్లు కంటే ముందు సిద్ధూ చాలా సినిమాల్లో నటించినా ఆయనకు అంత గా గుర్తింపు రాలేదు కానీ.. ఎప్పుడైతే డీజే టిల్లు సినిమాలో నటించాడో ఇక చూసుకోండి.. ఆ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయింది. సిద్ధూకు పేరొచ్చింది. ఒక్క సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు. అయితే.. డీజే టిల్లుకు సీక్వెల్ గా మరో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనూ సిద్ధూనే హీరో. కానీ.. ఈ సినిమా విషయంలో టిల్లు కాస్త ఎక్కువ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. కావాలని ఇష్టం ఉన్నట్టు కథలో మార్పులు కూడా చేస్తున్నాడని అంటున్నారు. ఎందుకంటే..


కార్తీకేయ 2 సినిమాతో హిట్ కొట్టి మాంచి ఊపు మీదున్న అనుపమ పరమేశ్వరన్ ను ముందుగా ఈ సినిమాకు హీరోయిన్ గా అనుకున్నారని తెలుస్తుంది.. తర్వాత ఏమైందో కానీ.. ఇప్పుడు అనుపమను కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే తప్పంచారట. నిజానికి.. అనుపమ కంటే ముందే చాలామందిని ఈ సినిమాకు హీరోయిన్ గా తీసుకున్నారు. సిద్ధూతో షూటింగ్ సమయంలో ఆమెకు సరిగ్గా అయితే పొసగలేదట. ఆమె చాలా ఇబ్బంది పడిందట. ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ.. వెంటనే అనుపమను పక్కకు అయితే తప్పించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి మడోన్నా సెబాస్టియన్ ను తీసుకున్నారని సమాచారం.. అయితే.. అనుపమ విషయంలో సిద్ధూనే అందరూ తప్పు పడుతున్నారు కానీ.. అనుపమ వైపు కూడా తప్పు ఉందని అంటున్నారు.ఈ ఇష్యూ ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: