తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు యాంకర్ గా మరొకవైపు హీరోయిన్ గా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పలు చిత్రాలలో నటిస్తోంది అనసూయ. మరికొన్ని చిత్రాలలో పాటలు పాడడమే కాకుండా స్పెషల్ సాంగులో కూడా నటించింది. అనసూయ మొదట ఒక న్యూస్ ఛానల్ లో యాంకర్ గా పనిచేసింది. ఆ తర్వాత వెండితెర పైన సైడ్ క్యారెక్టర్ గా అవకాశాలు రావడంతో యాంకర్ గా మారి జబర్దస్త్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షో వల్లే అనసూయ స్టార్ యాంకర్ గా గుర్తింపు పొందింది.


ఇప్పుడు తాజాగా అనసూయ జబర్దస్త్ కు దూరమై మరొక ఛానల్ లో యాంకర్ గా చేస్తున్నది. ప్రస్తుతం వెండితెర పైన కూడా పలు చిత్రాల నటిస్తూ బిజీగా ఉంటోంది. మొత్తానికి అనసూయ బుల్లితెర పైన కాకుండా వెండితెర పైన కూడా తన హవా కొనసాగించిందని చెప్పవచ్చు. ఈమెకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ అందంలో మాత్రం ఎటువంటి మార్పు లేదని చెప్పవచ్చు. ఇప్పటికీ అదే గ్లామర్ ని మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో తన అందచందాలతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంటూ ఉంటోంది అనసూయ. ఇక తనకు సంబంధించిన విషయాలను సైతం సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటూ ఉంటోంది.అనసూయ మీద ట్రోల్ చేసే వారిని గతంలో పట్టించుకోలేదు.. కానీ ఈ మధ్యకాలంలో వారందరికీ గట్టి కౌంటర్ ఇస్తూ వస్తోంది.తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక స్టోరీని పంచుకుంది.. ఎవరైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారో ఆ పాపులకు దూరంగా ఉండాలి అంటూ స్టోరీ పంచుకోగా ఆ స్టోరీ.. కి కొందరు గుర్తొస్తున్నారు అంటూ కామెంట్ పెట్టింది అనసూయ. ప్రస్తుతం ఈ కామెంట్స్ పెను సంచలనం గా మారింది. అనసూయ ఎవరిని ఉద్దేశిస్తూ ఇలా పోస్ట్ పెట్టింది అంటూ అభిమానులు సైతం పలు రకాలుగా చర్చించుకుంటున్నారు ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: