నందమూరి నట సింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా పోయిన సంవత్సరం అఖండ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో ఈ మూవీ లో కనిపించనుండగా , దునియా విజయ్మూవీ లో విలన్ గా కనిపించబోతున్నాడు. తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. కాకపోతే ఈ మూవీ విడుదల తేదీని ఇన్ని రోజుల పాటు ఈ మూవీ యూనిట్ ప్రకటించలేదు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. వీర సింహా రెడ్డి మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ లో బాలకృష్ణ పవర్ఫుల్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: