నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటికే అనేక విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. పోయిన సంవత్సరం విడుదల అయిన అఖండ మూవీ తో బాలకృష్ణ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న వీర సింహా రెడ్డి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ లో దునియా విజయ్ విలన్ పాత్రలో కనిపించనుండగా , శృతి హాసన్మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఒక పాత్రలో వీర సింహా రెడ్డి గాను మరొక పాత్రలో బాల సింహా రెడ్డి గాను కనిపించ బోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన "యూ ఎస్ ఏ" హక్కులను ఈ చిత్ర బృందం అమ్మివేసింది. ఈ మూవీ యొక్క "యు ఎస్ ఏ" హక్కులను పీ హెచ్ ఎఫ్ సంస్థ ,  శ్లోక ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నాయి. అలాగే ఈ మూవీ ని "యూ ఎస్ ఏ" లో వచ్చే సంవత్సరం జనవరి 11 వ తేదీనే విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: