టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి మూల స్తంభంగా నిలిచిన అలనాటి హీరో అక్కినేని నాగేశ్వరరావుకు ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే .సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నాగార్జున ఆయన వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రి వారసత్వం నిలబెడుతూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు .నాగార్జున అనంతరం ఆయన కొడుకులు నాగచైతన్య మరియు అఖిల్ కూడా సినీ ఇండస్ట్రీలో కీ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు అక్కినేని హీరోలు చేసిన ఒక పనికి టాలీవుడ్ డైరెక్టర్లు అందరూ కూడా షాక్ అవుతున్నారు. 

టాలీవుడ్ డైరెక్టర్లు లేరు అనేట్టుగా ఈ ముగ్గురు తమిళ దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇటీవల నాగార్జున గోస్ట్ సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే.దీని అనంతరం ఈ ముగ్గురు కూడా వారి తదుపరి సినిమాలను తమిళ దర్శకులతో చేయడానికి సిద్ధమయ్యారట .దీంతో వీరు ముగ్గురు అనుకొని ఇలా చేశారా లేక యాదృచ్ఛికంగా అలా జరిగిందా అంటూ.. సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి .నాగార్జున గోస్ట్ సినిమా అనంతరం గాడ్ ఫాదర్ సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్ రాజా తో సినిమా చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

 మరోవైపు అక్కినేని నాగచైతన్య థాంక్యూ సినిమా ద్వారా ఫ్లాప్ అందుకున్నప్పటికీ ఆయన తదుపరి చిత్రాలను తమిళ దర్శకులతో కలిసి చేస్తున్నారట. తమిళ దర్శకుడైన వెంకట ప్రభువు దర్శకత్వంలో రానున్న ఒక సినిమాలో నాగచైతన్య హీరోగా మరియు కృతి శెట్టి హీరోయిన్ గా  నటిస్తున్నారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగచైతన్య నటించినా.. వీరిద్దరితోపాటు అక్కినేని అఖిల్ కూడా మరో తమిళ దర్శకుడు అయిన పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు ఇటీవల అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు .ఈ నేపథ్యంలో మరో సినిమా చేయడానికి తమిళ దర్శకుడికి అవకాశం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒకే కుటుంబంలోని ఈ ముగ్గురు తమిళ్ డైరెక్టర్ లకు అవకాశం ఇవ్వడంతో టాలీవుడ్ డైరెక్టర్లు వీరుపై కోపంగా ఉన్నారానే వార్తలు వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: