రచయిత విజయేంద్ర ప్రసాద్ పేరు ఎరగని వారుండరు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన పేరు రాజమౌళి ఖ్యాతితో సమానంగా ఉండటంతో ఆమధ్య ఆయనను భారత ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. రాజమౌళి తీసే ప్రతి సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించి తీరుతాడు. ఆయన కథ లేకుండా రాజమౌళి సినిమాలు తీయడు.



ప్రస్తుతం జక్కన్న మహేష్ తో తీయబోతున్న ఒక భారీ ఎడ్వంచరస్ మూవీకి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఈకథ ఒక హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు రాజమౌళి తీసిన సినిమాలలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా మహేష్ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.



ఈ పరిస్థితుల మధ్య విజయేంద్ర ప్రసాద్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ఆయన చేసిన కామెంట్స్ టాప్ హీరోల అభిమానులకు అసహనాన్ని కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీకి మహేష్ ను మాత్రమే ఎందుకు ఎంపిక చేసారు అన్న విషయమై విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తూ. ``మహేష్ బాబు చాలా ఇంటెన్సిటీ ఉన్న నటుడు. అతడు నటించిన యాక్షన్ సన్నివేశాలను చాల ఎమోషనల్ చేస్తాడు. అది ఏ రచయితకైనా చాలా అవసరమైన మంచి విషయం`` అని అన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై చరణ్ జూనియర్ ప్రభాస్ అల్లు అర్జున్ అభిమానులు స్పందిస్తూ తమ హీరోలు కాకుండా ఒక మహేష్ బాబు మాత్రమే ఇంటెన్సిటీ  ఉన్న నటుడు అని విజయేంద్ర ప్రసాద్ భావిస్తున్నాడా అంటూ ఆ రచయితను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.




అయితే విజయేంద్ర ప్రసాద్ ఏ సందర్భంలో మహేష్ ను దృష్టిలో పెట్టుకుని ఆ కామెంట్స్ అన్నాడో తెలుసుకోకుండా టాప్ హీరోలు అందరికీ సూపర్ హిట్స్ ఇచ్చిన సినిమాలకు కథలు ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్ అనవసరంగా టాప్ హీరోల అభిమానులకు టార్గెట్ అవ్వడం భావవ్యక్తీకరణలో జరిగిన లోపం అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: