ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య" అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహిస్తూ ఉండగా , శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో మాస్ మహారాజ రవితేజ హీరో గా నటిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీ ని నిర్మిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. 

తాజాగా ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది ఇది ఇలా ఉంటే నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీ ని నిర్మిస్తుంది. 

మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీర సింహా రెడ్డి మూవీ ... మెగాస్టార్ చిరంజీవి హీరోగా తేరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ లు వరుసగా రెండు రోజుల్లో విడుదల కాబోతున్నాయి. దానితోఈ రెండు మూవీ ల మధ్య బాక్స్ ఆఫీస్ యుద్ధం భారీ లెవెల్ లో జరిగే అవకాశం ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ రెండు మూవీ లలో ఏ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలక్షన్ లను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: