టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పూరీ జగన్నాథ్.ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈయన విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో తీవ్ర స్థాయిలో నిరాశపరిచాడు. ఇక లైగర్  సినిమా ఫ్లాప్ అయిన అనంతరం పూరి జగన్నాథ్ మళ్లీ ఏ హీరోతో సినిమా చేస్తాడు అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇందులో భాగంగానే గత కొద్ది రోజులుగా పూరి జగన్నాథ్ మరియు బాలక్రిష్ణ కాంబినేషన్ లో ఒక సినిమా రానుంది అన్న వార్తలైతే వినిపిస్తున్నాయి. గతంలో బాలకృష్ణ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన పైసా వసూల్ సినిమా

 బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో బాలయ్య మరియు పూరి జగన్నాద్ ల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇక ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ సరైన కథతో బాలయ్యని కలిస్తే బాలయ్య కూడా పూరి జగన్నాథ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో చిరంజీవి మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో త్వరలోనే ఒక సినిమా రానుంది అన్న వార్తలు ప్రచారంలోకి వచ్చినప్పటికీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తనకెక్కిన లైజర్ సినిమాకు

 పూరి జగన్నాథ్ నిర్మాత కావడంతో ఆర్థికంగా పూరి జగన్నాథ్ చాలా నష్టపోయాడు అని చెప్పాలి. దీంతో ఈ ఏడాది అయినా పూరి జగన్నాథ్ కి కలిసి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు పూరి జగన్నాథ్ అభిమానులు. పూరి జగన్నాథ్ కష్టపడి మంచి కథతో ఒక సినిమాను తెరకెక్కిస్తే ఖచ్చితంగా ఆయన తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడు అని తమ అభిప్రాయాలని వ్యక్తపరుస్తున్నారు పూరీ జగన్నాథ్ అభిమానులు.ఇందులో భాగంగానే పూరి జగన్నాథ్ వేగంగా కథలు రాయడం వల్లే ఆయన   తీస్తున్న  సినిమాలు ఫ్లాప్ లావుతున్నాయి అన్న కామెంట్స్ సైతం కొందరు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: