బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ సినిమాలో రానా విలన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. రమ్యకృష్ణ తల్లి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా బాహుబలి 2 సినిమాను తీశారు జక్కన్న. ఇక ఈ సినిమా ఏప్రిల్ 28, 2017వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలనాలు సృష్టించింది. ఈ సినిమాను ఏకంగా రూ. 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు.
ఈ సినిమా వల్ల నిర్మాతలు భారీగా లాభపడ్డారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది. దీంతో బాహుబలి 2 సినిమాకు కూడా భారీ ఎత్తున కలెక్షన్లు వచ్చాయి. కాగా ఈ బాహుబలి 2 సినిమాకు మొత్తంగా వచ్చిన కలెక్షన్లు రూ. 1,810.60 కోట్లు. ఈ సినిమా అనంతరం ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో మాత్రమే నటించడం విశేషం. ఓ రాజ్యం కోసం ప్రభాస్ , రానా మధ్య పోరాటాన్ని అద్భుతంగా తీశారు జక్కన్న.
అటు ఈ సినిమాలో అనుష్క, రమ్యకృష్ణ కూడా సూపర్ గా నటించారు. బాహుబలి 2 సినిమాతో ప్రభాస్, రాజమౌళి రేంజ్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, సలార్ 2 సినిమాలలో నటిస్తున్నారు. ఎప్పటికప్పుడు తన సినిమాలతో ప్రభాస్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు. తన నటన, సినిమాలతో ప్రేక్షకులకు చేరువలో ఉంటాడు డార్లింగ్ ప్రభాస్.