ఇక అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్లకు సపోర్ట్గా పోస్టులు పెడుతున్నారు. “ఈ సినిమా మీద ఎటువంటి నెగిటివ్ రూమర్స్ రాకూడదు”, “ప్రశాంత్-తారక్ కాంబో ఒకసారి థియేటర్లో పేలిపోతుంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ మేకర్స్ 2026 జూన్ 25వ తేదీన ధిఏటర్స్ లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేశారు మూవీ మేకర్స్. ఇప్పటికే షూటింగ్ షెడ్యూల్స్లో కొంత ఆలస్యం జరిగినప్పటికీ, ఇప్పుడు టీమ్ ఫుల్ స్పీడ్లో వర్క్ చేస్తోంది. ప్రశాంత్ నీల్ తన ప్రత్యేకమైన టేకింగ్ స్టైల్తో సినిమా మొత్తాన్ని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉన్నాడు.
ఇక “దేవర 2”పై కూడా ఆయనకు క్లియర్ గా ముందుకు వెళ్తున్నారు. దేవర ఫస్ట్ పార్ట్లో చూపించిన విజువల్ గ్రాండియర్ను మించి, మరింత ఎమోషనల్ మరియు ఇన్టెన్స్ నేరేటివ్తో రెండో పార్ట్ను తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇక మొత్తానికి చెప్పాలంటే — ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మధ్య ఎటువంటి గొడవలు లేవు. ఇది పూర్తిగా కొంతమంది ఆకతాయిల సృష్టించిన పుకారు మాత్రమే. ఇద్దరూ తమ పని పట్ల ఎంతగానో కట్టుబడి ఉన్నారు. వచ్చే ఏడాది థియేటర్లో ఈ కాంబినేషన్ సినిమా విడుదలైనప్పుడు, ఈ రూమర్స్ అన్నీ ఎంత నిరర్థకమో అందరికీ అర్థమవుతుంది.ఎన్టీఆర్ మాస్ ఎనర్జీ, ప్రశాంత్ నీల్ రగ్డ్ నేరేషన్ – ఈ రెండు కలిస్తే వచ్చే ఎక్స్ప్లోషన్ ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టం. ఇప్పుడు అభిమానులందరి దృష్టి ఒక్కటే — “ఈ మాస్ బ్లాక్బస్టర్ ఎప్పుడు థియేటర్లో పేలిపోతుందా?” అన్నదే!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి