ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా స్థానం సంపాదించిన హీరోయిన్..ఎవరో మీకు గుర్తుకు వచ్చే ఉంటుంది..అవును శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘ఫిదా’హీరోయిన్ సాయి పల్లవి.  మాలీవుడ్ లో ‘ప్రేమమ్’సినిమాతో కెరీర్ ప్రారంభించిన తెలుగు లో నటించిన మొదటి సినిమా ‘ఫిదా’.  ఈ సినిమాలో అచ్చమైన తెలంగాణ యాస మాట్లాడుతూ..భానుమతి హైబ్రీడ్ పిల్లా అంటూ కొట్టే చిలిపి డైలాగ్ కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుకున్నాయి.  


ఈ సినిమా తర్వాత సాయి పల్లవికి తెలుగుతో పాటు తమిళ, మళియాళ బాషల్లో వరుస ఛాన్సులు రావడం మొదలయ్యాయి.  తెలుగు లో డైరెక్ట్ గా కాకుండా తమిళ డబ్బింగ్ సినిమాలతో కూడా బాగానే ఆకర్షిస్తుంది.  తాజాగా సాయిపల్లవి నటించిన 'ఎన్జీకే' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూర్య జోడీగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేయాని భావించింది. కానీ సమయాభావం వల్ల అది కుదరలేదు.


అందుకు ఫ్యాన్స్ కి తన వివరణ ఇచ్చుకుంది.. నిరాశకి లోనైన నెటిజన్లు సాయిపల్లవి ధోరణి పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. 'మా సమయం వృథా చేసుకుని నీతో చాటింగుకి వెయిట్ చేస్తుంటే నువ్వు చీటింగ్ చేస్తావా?' అంటూ విరుచుకుపడ్డారు. దాంతో సాయిపల్లవి నెటిజన్లకు 'సారీ' చెప్పేసింది. 'మరోసారి ఎప్పుడైనా సోషల్ మీడియాలో కలుద్దాం' అంటూ కూల్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: