స్వర్గీయ దాసరి నారాయణరావు పెద్ద కొడుకు ప్రభు అదృశ్యం అయ్యాడు . ఈనెల 9 న బయటకు వెళ్లిన దాసరి ప్రభు మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు దాంతో అన్ని చోట్లా వెతికిన తర్వాత పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు . తెలుగు చలనచిత్ర చరిత్రలో అజరామరమైన చిత్రాలను అందించి చరిత్ర సృష్టించిన వ్యక్తి  దాసరి .


దాసరి నారాయణరావు కు ఇద్దరు కొడుకులు కాగా పెద్ద కొడుకు దాసరి ప్రభు . ఈ ప్రభు కి రెండు పెళ్లిళ్లు అయ్యాయి . మొదటి నుండి భార్యాభర్తల మధ్య గొడవలు అధికం కావడంతో నిత్యం వివాదాలు జరుగుతూనే ఉన్నాయి .


2008లో కూడా ఆయన ఒక సారి ఇలాగే అదృశ్యమయ్యారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన ప్రభు.. తన భార్య సుశీలే తనను కిడ్నాప్‌ చేయించిందని ఆరోపించారు. అయితే ఇప్పుడు దాసరి ప్రభు అదృశ్యం వెనుక ఉన్న హస్తం ఎవరిదీ అన్న అనుమానం మొదలయ్యింది . దాసరి నారాయణరావు మరణించడంతో కుటుంబంలో ఆస్తుల వ్యవహారంలో వివాదాలు జరుగుతున్నాయి . ఆ వివాదాలే ప్రభు అదృశ్యం కు కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు .


మరింత సమాచారం తెలుసుకోండి: