సాహో సినిమా టీజర్ రిలీజ్ అయిన కొద్దీ గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. టీజర్ విడుదలైన ఆరు గంటల్లోనే ఏకంగా 25 మిలియన్ ల వ్యూస్ ను రాబట్టింది. సాహో టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ చిత్రంపై ఆసక్తిగా ఉన్నారని తేలిపోయింది. అయితే సినిమా బాలీవుడ్ లో ఏ స్థాయి వసూళ్లను రాబట్టగలదనే విషయమై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.


సినిమాకున్న క్రేజ్ నేపథ్యంలో బాలీవుడ్ రైట్స్ భారీ మొత్తంకు అమ్ముడు పోయాయి. కాని సాహో చిత్రంకు పోటీగా అక్షయ్ కుమార్ నటిస్తున్న మిషన్ మంగళ్ విడుదల కాబోతుంది. బాలీవుడ్ లో సూపర్ స్టార్ హీరో అయిన అక్షయ్ కుమార్ మూవీతో పోటీ పడటం అంటే మామూలు విషయం కాదు. పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా గతంలో అక్షయ్ తో పోటీ పడి చతికిల పడిపోయారు.


ఇప్పుడు సాహోతో ప్రభాస్ ఏ స్థాయిలో అక్షయ్ ని ఢీ కొట్టగలడనేది అనుమానమే.అక్షయ్ పోటీ లేకుండా సోలో రిలీజ్ అయితే సాహో చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సాహోకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాని బాలీవుడ్ కు వచ్చేప్పటికి అక్షయ్ భయపెడుతున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: