తెలుగు చిత్ర పరిశ్రమలో 'మహానటి'గా గుర్తింపు పొందిన హీరోయిన్ కీర్తి సురేష్. 'మహానటి' చిత్రం తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో నటించినప్పటికీ కోలీవుడ్‌లో మాత్రం ఒక్కటంటే ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. దీనికి కారణం ఆమె స్లిమ్‌గా ఉండటమే. స్లిమ్‌గా ఉన్నందువల్ల ఆమెకు సరైన అవకాశాలు రావడం లేదు. ఫలితంగా కోలీవుడ్ వెండితెరపై ఆమె కనిపించడం లేదు.


నిజానికి కీర్తి సురేష్ గత యేడాది ఏకంగా 8 చిత్రాల్లో నటించింది. అందులో 'మహానటి', 'సర్కార్'‌ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందించాయి. ప్రస్తుతం అమ్మడు ఓ బాలీవుడ్‌ చిత్రంలో అజయ్‌దేవగన్‌ సరసన నటిస్తోంది. ఈ చిత్రం కోసం తన బరువును కూడా తగ్గించింది.


ఫలితంగా గతంలో బొద్దుగా ఉన్న కీర్తి ప్రస్తుతం స్లిమ్‌గా మారింది. తమిళ అభిమానులకు స్లిమ్‌ కంటే బొద్దుగా ఉన్న హీరోయిన్లనే ఇష్టపడతారు. గతంలో ఖుష్బూ, నమిత, హన్సికలు బొద్దుగా వున్నందుకే భారీ అభిమానులను సంపాదించుకున్నారు. సో... కీర్తి సురేష్ కూడా కోలీవుడ్‌లో రాణించాలంటే.. కాస్త బొద్దుగా మారాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ దిశగా కీర్తి సురేష్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: