నందమూరి తారక రామారావు చనిపోయి 24 సంవత్సరాలు దాటిపోయినా ఆయన భార్య లక్ష్మీపార్వతి ఎప్పుడు మీడియా వార్తలకు చిరునామాగానే కొనసాగుతోంది. తెలుగుదేశ పార్టీ ఓటమి చంద్రబాబు పతనం జీవిత ధ్యేయంగా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన ఆమె కోరిక మొన్నటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఆమె కోరిక నెరవేరింది. 

సాధారణంగా ఫంక్షన్స్ లో టివి చర్చా గోష్టులలో తరుచు హడావిడి చేసే ఈమెకు ఒక కొడుకు ఉన్నాడని తెలిసినా అతడు ఎప్పుడు మీడియా ముందు కనిపించలేదు. అయితే ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా లక్ష్మీపార్వతి కొడుకు వివరాలు బయట పడ్డాయి. లక్ష్మీ పార్వతి కొడుకు పేరు కోటేశ్వర ప్రసాద్.

ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక కార్పోరేట్ హాస్పటల్ లో వైద్యుడుగా పనిచేస్తున్న ఇతడు తన వివరాలను బయటకు చెప్పుకోవడానికి ఎప్పుడు ఇష్టపడలేదట. చిన్నతనం నుంచి తన తల్లి లక్ష్మీ పార్వతి ప్రోత్సాహంతో పెద్ద చదువులు చదవాలి అన్న కోరిక కలిగి మోహన్ బాబు ఇంట్లో కొన్ని సంవత్సరాలు ఉన్న విషయాన్ని ఆయన ఆ ఇంటర్వ్యూలో తెలియచేసాడు. 

అంతేకాదు తాను తన చిన్న తనంలో ఎన్టీఆర్ ను ‘అంకుల్’ అని మాత్రమే పిలిచేవాడినని అంతేకాదు తాను తన చిన్నతనంలో పాటలు పాడటం ఇష్టం ఉన్న నేపధ్యంలో తాను ఎన్టీఆర్ ఎదురుగా అనేక సార్లు పాటలు పాడిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం తన పాటలు విని మెచ్చుకున్నా ముందు చదువు బాగా చదివి డాక్టర్ అవమని అనేక సార్లు అప్పట్లో తనతో చెప్పిన విషయాలను కోటేశ్వర ప్రసాద్ గుర్తుకు చేసుకున్నాడు. సినిమాలు చాల తక్కువగా చూసే ఇతడు వర్మ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీని చూశానని ఆ సినిమాలో చూపించిన సంఘటనలు చాల వరకు యదార్ధం కావడమే కాకుండా తనకు గుర్తు ఉన్న విషయాలను ఆ ఇంటర్వ్యూలో తెలియ చేసాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: