సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వినబడుతున్నాయి. గత కొంత కాలం నుండి మణిరత్నం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో జాయిన్ అయినట్టు మీడియాలో వరుసగా కథనాలు వస్తున్నాయి. దీంతో చాలామంది మణిరత్నం అభిమానులు న్యూస్ విని కంగారు పడటం మొదలు పెట్టారు.


ఇటువంటి క్రమంలో మణిరత్నం భార్య సుహాసిని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఉద్దేశించి తన ట్విట్టర్ ఎకౌంట్లో ఒక్క ట్వీట్ తో అందరి నోళ్ళు మూయించింది.మణిరత్నం గురించి వస్తున్న వార్తలపై ఆయన సతీమణి సుహాసిని సోషల్ మీడియాలో స్పదించారు. నా భర్త తదుపరి సినిమా వర్క్ కోసం ఉదయం 9:30 గంటలకే ఆఫీస్ కు వెళ్లారు. నేను తదుపరి సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ లో ఇంట్లో బిజీగా ఉన్నాను.


నా భర్త ఉదయం చేసిన రోటి, మామిడికాయ పచ్చడి ఇష్టంగా తిని నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ కోసం ఆఫీస్ కు వెళ్లారు అని సుహాసిని తెలిపింది.దీనితో మణిరత్నం ఆరోగ్యంపై వస్తున్న పుకార్లన్నీ పటాపంచలయ్యాయి. మణిరత్నం తదుపరి పొన్నియన్ సెల్వం చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. భారీ బడ్జెట్ తో మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పనిలో ఉన్నారు డైరెక్టర్ మణిరత్నం.  

 



మరింత సమాచారం తెలుసుకోండి: