ఎన్నికలల‌లో వైసిపి అధినేత‌ జగన్ మోహన్ రెడ్డికి నేరుగా తెలుగు సినీ పరిశ్రమ భారీగా మద్దతుఇవ్వ‌టంతో పాటు మోహన్ బాబు, పోసాని కృష్ణ మురళి, పృథ్వి, అలీ,జీవిత రాజశేఖర్, జయసుధ  త‌దిత‌రులు ప్ర‌చార స‌భ‌ల‌లో పాల్గొన్నారు కూడా .  ఇక .  కాగా తొలి నుంచి వైసీపికి బాస‌ట‌గా నిల‌చిన న‌టుడు ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణమురళికి వైసీపీ తరపున శాస‌న‌మండ‌లికి పంపాల‌ని ఆ పార్టీ సిద్దంగా ఉంద‌ని ఓ గుస‌గుస ఇండస్ట్రీలో వినిపిస్తోంది.


 ఆంధ్రప్రదేశ్ సినీ,టీవీ రంగానికి సంబదించిన ఏపి చ‌ల‌న చిత్ర అభివృద్ధి సంస్ధ  చైర్మన్ కావాల‌ని పోసాని త‌న స‌న్ని హితుల ద్వారా జ‌గ‌న్‌కి చెప్పించిన‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల ఓ టివి చాన‌ల్‌కి పోసాని ఇంట‌ర్వూ ఇస్తూ,  పార్టీ గెలిచిన వెంటనే వైసీపీ పెద్దలు నన్ను కలిసి ఏమైనా పదవి కావాలా అని అడిగారు. నాకేమి వద్దు, ఎలాంటి స్వార్థం లేకుండా జగన్ కోసం పనిచేస్తానని చెప్పను.


  మురళి నువ్వు ఆ పదవిలో పనిచేస్తే బాగుంటుందని చెప్పి,  అప్పగిస్తే చేయటానికి సిద్ధంగా వున్నానంటూ తన మనస్సులోని కోరికని బయటపెట్టాడాన్ని ఉదాహ‌ర‌ణ‌గా చెపుతున్నారు. మొత్తానికి జగన్ తనని నమ్ముకున్న వాళ్ళకు పదవులు ఇవ్వలనుకుంటున్నారు. సినిమా వాళ్ళను ఆయన గుర్తు పెట్టుకుని మరీ అందలం ఎక్కించాలనుకుంటున్నారు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: