టాలీవుడ్ లో వివాదాస్పద దర్శకుడిగా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ, ఏది చెప్పినా, ఏమి చేసినా అది కొంత వైద్యంగానే ఉంటుంది. ఇటీవల తాను నిర్మించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలోని టిడిపి పార్టీ, తమ సినిమాని విడుదల చేయనీకుండా అడ్డుపడింది అంటూ ఆ పార్టీపై పరోక్షంగా విమర్శలు చేసిన వర్మ, 

ఇటీవల ఏపీలో కొత్త అధికారాన్ని చేపట్టిన వైసీపీ పార్టీపై అలానే జగన్ మోహన్ రెడ్డి విజయం పై ఒక వీడియోని సైతం విడుదల చేసి హడావుడి చేసారు. ఆపై త్వరలో తాను ఈ పరిస్థితిని బేస్ చేసుకుని 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమా కూడా తీయబోతున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని టార్గెట్ చేస్తూ కాసేపటిక్రితం వర్మ తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్ట్ చేసారు. అసలు ప్రస్తుతం జరుగుతున్న ఈ సమావేశాలు గతంలో జరిగిన విషయాలను తలచుకుని అరవడానికి, గొడవపడడానికి, 

అలానే వాటిపై ఒకరినొకరు పరస్పరం దూషించుకోవడానికా? లేక   ప్రస్తుత, మరియు భవిష్యత్తులో రాబోయే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అని చర్చించడానికా? అంటూ జస్ట్ అస్కింగ్ పేరుతో ఓ ట్వీట్ చేసారు. నిజానికి వర్మ చేసే ప్రతిపనీ ఎంతో సంచలనాన్ని రేకెత్తిస్తుంది. ఇక ఎప్పుడూ సినిమాలు, వివాదాస్పద అంశాలపై తన అభిప్రాయాలు చెప్పే వర్మ, ఉన్నట్లుండి సడన్ గా రాజకీయాలపై ఎందుకు మాట్లాడుతున్నారో ఎవ్వరికీ అర్ధం కావడంలేదు. కాగా వర్మ చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: