కెట్ నేపథ్యంలో ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్ ప్లే చేసిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ టీజర్ చూడగానే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఐశ్వర్యా రాజేష్, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో.. సీనియర్ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ టీజర్ను మంగళవారం నాడు విడుదల చేశారు మెగాస్టార్ చిరంజీవి.
చిరంజీవి మాట్లాడుతూ... ఇది క్రికెట్ నేపథ్యంలో వస్తోన్న విభిన్న కథాంశమిది. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ మూవీస్కి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. నేషనల్ వైడ్గా స్పోర్ట్స్ నేపథ్యంలో తీసిన ప్రతి సినిమా ఘన విజయం సాధించాయి. గేమ్స్కి అంతటి ప్రాధాన్యత ఉంది. ఇండియాలో క్రికెట్ అనేది ఒకరకంగా చెప్పాలంటే నేషనల్ గేమ్లాంటిది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గేమ్ బ్యాక్డ్రాప్లో వస్తోన్న సినిమా 'కౌసల్య కృష్ణమూర్తి'. ఇందులో హీరోయిన్గా చేసిన ఐశ్యర్యా రాజేష్ ఉమెన్ క్రికెటర్ పాత్రలో ఒదిగిపోయారు.
క్రికెటర్ క్యారెక్టర్కి జస్టిఫై చేయడానికి నాలుగైదు నెలల పాటు శిక్షణ తీసుకొని ఆ తర్వాత షూటింగ్ చేయడం ప్రారంభించింది అంటే ఆ అమ్మాయికి ఉన్న డెడికేషన్, శ్రద్ధాసక్తులు, పడిన కష్టం కానీ అంతా ఇంతా కాదు. ఐశ్వర్యా రాజేష్ ఎవరో కాదు.. మా కొలీగ్ రాజేష్ కూతురు. అలాగే కమెడియన్ శ్రీలక్ష్మీ మేనకోడలు. మన తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు కొరవడిపోతున్న ఈరోజుల్లో ఐశ్వర్యా రాజేష్ రావడం అన్నది శుభపరిణామం. నేను ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తూ.. స్వాగతం పలుకుతున్నాను.
ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఎలాంటి ప్రోత్సాహం లేని వాతావరణం నుండి వచ్చి తనకు తానుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటూ అంతర్జాతీయ స్థాయికి వెళ్లి, ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదించి, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసేవిధంగా క్లైమాక్స్ ఉంటుంది అని చెప్పారు. నాకు ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా విజయవంతం అవుతుందని, మంచి విజయవంతమైన సినిమాలకు పెట్టింది పేరైన క్రియేటివ్ కమర్షియల్స్కి ఇది మరో విజయం అవుతుంది.