మరో రెండు రోజులలో విడుదల కాబోతున్న బాలీవుడ్ రీమేక్ ‘కబీర్ సింగ్’ బాలీవుడ్ లో ట్రెండ్ సెటర్ గా మారుతుందని ఈమూవీలో షాహిద్ కపూర్ కలలు కంటున్నాడు. దీనితో ఈమూవీని ప్రమోట్ చేస్తూ అనేక మీడియా సంస్థలకు షాహిద్ కపూర్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. 

ఈమూవీలో విజయ్ దేవరకొండ పాత్రను బాలీవుడ్ లో నటించడానికి తాను పడ్డ పాట్లను వివరిస్తూ ఈమూవీ షూటింగ్ కోసం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8   గంటల వరకు తాను పడ్డ కష్టంతో ఒకొక్కసారి తాను ఆ సీన్స్ చేయలేక వాంతులు చేసుకున్న సందర్భాన్ని కూడ వివరించాడు. అయితే ఇలాంటి మంచి సినిమాలో నటించే ఇలాంటి అవకాసం తనకు మహేష్ వల్ల మాత్రమే వచ్చింది అంటూ ఒక ఆసక్తికర విషయాన్ని తెలియచేసాడు. 

‘అర్జున్ రెడ్డి’ మూవీ తరువాత దర్శకుడు సందీప్ వంగ మహేష్ తో సినిమా చేయడానికి చాల ప్రయత్నించిన విషయాన్ని తెలియచేస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ షాహిద్ కపూర్ చేసాడు. మహేష్ ఆ ప్రాజెక్ట్ పట్ల పెద్దగా ఆసక్తి కనపరచకుండా వంశీ పైడిపల్లితో ‘మహర్షి’ ప్రాజెక్ట్ కు వెళ్లిపోవడంతో సందీప్ వంగ ‘అర్జున్ రెడ్డి’ మూవీని బాలీవుడ్ లో తనతో రీమేక్ చేసిన విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా బయటపెట్టాడు. 

దీనితో అనుకున్న విధంగా ‘కబీర్ సింగ్’ సూపర్ హిట్ అయితే ఆ క్రెడిట్ అంతా మహేష్ కు చెందుతుందని అంటూ సాహిద్ ఒక షాకింగ్ కామెంట్ చేసాడు. సాధారణంగా ఉత్తరాది హీరోలు దక్షిణాది హీరోల గొప్పతనాన్ని అంగీకరించరు. అయితే దీనికి భిన్నంగా ఈ బాలీవుడ్ హీరో మహేష్ పై చేసిన ప్రశంసలతో మహేష్ అభిమానులు ఎంతవరకు ‘కబీర్ సింగ్’ కు ఓటు వేస్తారో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: