ఊహలు గుస గుస లాడేతో మంచి పేరు సంపాదించుకుంది రాశీ ఖన్నా. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఇంత గుర్తింపు రాలేదు.  ఆ తర్వాత తను నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేదు. దీంతో ఫ్లాప్ హీరోయిన్ గా కొద్దిగా ముద్ర పడిన విషయం వాస్తవం. అయినప్పటికీ ఆమెకి అవకాశాలు తగ్గట్లేదు." తొలిప్రేమ" సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది.

 

ప్రస్తుతం రాశీ ఖన్నా కి మరో మెగా హీరో తో నటించే అవకాశం వచ్చిందట. ఇటీవలే "చిత్రలహరి" సినిమాతో విజయం సాధించి జోష్ మీదున్న " సాయి ధరమ్ తేజ్ " తన తర్వాతి సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహించనున్నారు. కాగ ఇందులో ఇద్దరు కథానాయికలు వెతుకుతున్నారట.ఒక కథానాయికగా "రుక్సాన్ థిల్లర్" తీసుకున్నారట.

 

అదే స్థాయిలో మరో కథానాయికను తీసుకుంటే ప్రాజెక్టుపై క్రేజ్ తగ్గుతుందని భావించిన మారుతి, కాస్త క్రేజ్ వున్న గ్లామర్ హీరోయిన్ ను మొదటి నాయికగా తీసుకుంటే బాగుంటుందని భావించాడట. అందుకని గ్లామర్ హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారు ఆ చిత్ర యూనిట్. చాలా మంది పేర్లను పరిశీలించారట. అలా రాశీ ఖన్నా పేరు కూడా పరిశీలనలోకి వచ్చిందట.

 

అందరినీ పరిశీలించిన పిమ్మట దర్శకుడు మారుతి "రాశీ ఖన్నా" వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఆమె బడ్జెట్ కూడా తమ పరిధిలోనే ఉండడంతో ఆమెను ఓకే  చేసారట. ఆల్రెడీ తేజూ తో ఆమె 'సుప్రీమ్' హిట్ కొట్టి ఉండటం వలన ఆమెనే ఖరారు చేసే ఆలోచనలో మారుతి వున్నాడని అంటున్నారు. మొత్తానికి మరోసారి ఈ జోడీ తెరపై సందడి చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: