ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి..మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది.  ఏపికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.  ఇదంతా ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నామని డౌట్ వచ్చిందా...అయితే మొన్న జరిగిన లోక్ సభ, శాసన సభ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘జనసేన’పార్టీ తరుపు నుంచి పోటీ చేయడం ఓడిపోవడం జరిగింది.  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’సినిమా తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లారు.

మూడు నెలల పాటు ముమ్మరంగా ప్రచారం చేశారు.  కానీ ఫలితాలు మాత్రం దారుణంగా వచ్చాయి.. కేవలం ఒక్క సీటంటే ఒక్కసీటు మాత్రమే గెలుపొందారు.  దాంతో మొన్నటి వరకు ఎన్నికల్లో ఎందుకు వైఫల్యం చెందారు అన్న విషయంపై అన్ని ఏరియాల్లో తిరిగి సమీక్షలు చేశారు పవన్ కళ్యాన్.  అయితే ఎన్నికల ప్రచారంలో గుబురు గడ్డం..పంచకట్టు తో ప్రత్యేకంగా కనిపించారు. అయితే గెలిచినా.ఓడినా పవన్ కళ్యాణ్ పాతికేళ్ళపాటు రాజకీయాల్లోనే కొనసాగుతానని ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు.

  కానీ మొన్నటి ఫలితాల్లో ఆయన పూర్తిగా నిరుత్సాహ పడ్డట్లు తెలుస్తుంది..అంతే కాదు ఆ మద్య డబ్బులిచ్చే నాయకుల వద్ద ఓటర్లు బిచ్చమెత్తుకునే బదులు గుడి ముందు కూర్చుంటే డబ్బులు వస్తాయని ఘాటైన కామెంట్స్ చేశారు.  ఇదిలా ఉండగా ఎన్నిల తర్వాత నిన్నమొన్నటి వరకు పవన్ ఎక్కువగా పెరిగిన గడ్డంతో కనిపించారు.

తాజాగా పవన్ కళ్యాణ్ గడ్డం ట్రిమ్ చేసి స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు.  కలర్ ఫుల్ డ్రెస్ తో, పక్కనే ఓ చిన్నారి ఉండడం చూస్తుంటే పవన్ కళ్యాన్ వెండితెరపై మెరబోతున్నారా..ఇదేనా సిగ్నల్ అని అనుకుంటున్నారు.   పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అని కొంతమంది అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఏది ఏమైనా పవన్ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ఆయన తీసుకోబోయే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: