రజినీకాంత్ సూర్య అమితాబ్ లాంటి ప్రముఖ నటులు రాజమౌళి నుంచి పిలుపు వస్తే బాగుంటుంది అని ఓపెన్ గా చెపుతున్న పరిస్థుతులలో శ్రీదేవి కూతురు జాహ్నవి రాజమౌళి ఆఫర్ ను తిరస్కరించింది అని వార్తలు రావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. గతంలో ‘బాహుబలి’ తీస్తున్న సమయంలో శివగామి పాత్రను తిరస్కరించిన శ్రీదేవి సాంప్రదాయాన్ని ఆమె కూతరు కొనసాగించడం యాధృశ్చికం అనుకోవాలి.

తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి బ్రిటీష్ నటి డైసీ తిరస్కరించిన పాత్రను రాజమౌళి జాహ్నవికి ఆఫర్ చేసినట్లు టాక్. అయితే ఈపాత్రను జాహ్నవి తిరస్కరించడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది అని అంటున్నారు. 

ఈమూవీలో నటిస్తున్న బాలీవుడ్ అలియా భట్ పాత్ర పెద్దదిగా ఉండి తన పాత్ర చిన్నదిగా ఉంటే తాను అలియా భట్ కన్నా తక్కువ స్థాయిలో ఉన్న హీరోయిన్ అన్న సంకేతాలు ఇండస్ట్రీకి అందుతాయని అందువల్ల తాను డైసీ పాత్రను నటించలేను అంటూ సున్నితంగా జాహ్నవి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో మరొకసారి రాజమౌళికి శ్రీదేవి కుటుంబం నుండి నిరాశ ఎదురైనట్లు అయింది. 

గతంలో రాజమౌళి ‘బాహుబలి’ విడుదల సమయంలో ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ తన మూవీలో శివగామి పాత్రను శ్రీదేవి తిరస్కరించడం ఒక అదృష్టం అనీ అంటూ అలా జరగకుంటే తనకు రమ్యకృష్ణ శివగామిగా లభించి ఉండేదికాదు అంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ కామెంట్స్ పెను సంచలనం సృష్టించాయి. దీనితో శ్రీదేవి కూతురు అప్పటి రాజమౌళి కామెంట్స్ కు ఇప్పుడు సరైన సమాధానం ఇచ్చిందా అన్న సందేహాలు రావడం కూడ సహజం..  


మరింత సమాచారం తెలుసుకోండి: