ఇండియన్ క్రికెట్ టీమ్ కు నాయకత్వం వహిస్తున్న విరాట్ కొహ్లీ ఆద్వర్యంలో ముచ్చటగా మూడవసారి వరల్డ్ కప్ విజేతలు అవ్వాలని 137 కోట్ల భారతీయులు ఆశిస్తున్నారు. అదే స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానానికి ఎదగాలని జూనియర్ అభిమానులు ఆశిస్తున్నారు. 

ఇలాంటి పరిస్థుతులలో విభిన్న రంగాలకు చెందిన ఈ ఇద్దరు సెలెబ్రెటీలు ఒక సామాజిక అంశం కోసం ప్రచారం చేసే విషయంలో కలవబోతూ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ జాతీయ న్యూస్ ఛానల్ NDTV ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ విషయంలో తీవ్ర స్థాయిలో ప్రచారం చేసి రోడ్డు యాక్సిడెంట్స్ విషయంలో ప్రజలను చైతన్య పరచడానికి రూపొందించిన ప్రచార యాడ్స్ లో విరాట్ కొహ్లి జూనియర్ లు కలిసి నటించబోతున్నారు. 

జాతీయ స్థాయిలో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ తెలుగు రాష్ట్రాలలో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న మ్యానియాను దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ యాడ్ ను అన్ని ప్రముఖ న్యూస్ ఛానల్స్ లో ప్రసారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ప్రాంతీయ భాషకు సంబంధించి ఒకొక్క టాప్ హీరోను ఎంపిక చేసి వారిని విరాట్ కొహ్లీతో కలిపి ఈ యాడ్ ను చిత్రీకరించబోతున్నారు. 

రోడ్డు ప్రమాదాలలో జూనియర్ తన తండ్రిని అదేవిధంగా తన అన్నను పోగొట్టుకున్న పరిస్థుతులలో జూనియర్ నోటివెంట వచ్చే మాటలు వెంటనే జనంలోకి వెళ్ళిపోతాయి కాబట్టి తెలుగు యాడ్ కు సంబంధించి జూనియర్ ను ఎంపిక చేసినట్లు టాక్. ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ లో చిక్కుకోవడం వల్ల జూనియర్ సినిమాలు మరొక సంవత్సరం వరకు లేని పరిస్థుతులలో ఇలా తారక్ తన అభిమానులకు బుల్లితెర పై సందడి చేయబోతున్నాడు అనుకోవాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి: