తనిష్క్రెడ్డి, ఎలక్సియస్ జంటగా రామకృష్ణ వెంప దర్శకత్వం లో శ్రీనంద ఆర్ట్స్ పతాకంపై క్రాంతి కిరణ్ వెల్లంకి నిర్మిస్తున్న చిత్రం ‘దర్పణం’. రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. మొన్నే టీజర్ విడుదలయింది. ఈ టీజర్ కి మంచి స్పందన లభించింది. టీజర్ కి వచ్చిన స్పందనని చూసి చిత్ర యూనిట అంతా సంతోషంగా ఉన్నారు.
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు రామక్రిష్ణ వెంప మాట్లాడుతూ, ఈ సినిమా చిత్రీకరణ చాలా బాగా జరిగిందని, అందరు నటులు చాలా చక్కగా చేసారని చెప్పాడు. ఈ సినిమా కి నిర్మాత అయిన క్రాంతి కిరణ్ మొదటి నుండి ఈ సినిమా మీద నమ్మకంతో ఉన్నారని అన్నాడు.
నిర్మాత క్రాంతి కిరణ్ ప్రొడక్షన్ విషయంలో చాలా బాగా చూసుకున్నారని, ఏది అదిగినా వెంటనే చేసేవారని, అటువంటి నిర్మాత దొరకడం వల్లే సినిమా అద్భుతంగా వచ్చిందని అన్నాడు.క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో రాబోతున్న ఈ చిత్రం లాస్ట్ మినిట్ వరకు ఏం జరుగుతుందా అని సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూ ఆద్యంతం అలరిస్తుంది అన్నాడు.
నిర్మాత క్రాంతి కిరణ్ వెల్లంకి మాట్లాడుతూ… చాలా కష్టపడి ఇష్టపడి సినిమా చేశాము.. ఈ చిత్రానికి అందరు సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని సెన్సార్ పనుల్లో ఉన్నాము.. వచ్చేనెలలో సినిమా రిలీజ్ అవుతుంది.. ఇప్పటివరకు వచ్చిన థ్రిల్లర్ సినిమా లను మించి ఈ సినిమా ఉంటుంది అన్నారు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ మరో మైలు రాయిని క్రియేట్ చేస్తుందా తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.