‘మజిలీ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాగ చైతన్య.. శేఖర్ కమ్ములతో సినిమాకి రెడీ అయ్యారు. ‘ఫిదా’ చిత్రం తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల చైతూ కోసం ఓ బ్యూటిఫుల్ కథను రెడీ చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చింది.


‘ఫిదా’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న క్రియేటివ్ దర్శకుడు శేఖర్ కమ్ముల లాంగ్ గ్యాప్ తరువాత అక్కినేని హీరోతో సినిమాకి లైన్ క్లియర్ చేసుకున్నారు. అక్కినేని నాగ చైతన్య హీరోగా బ్యూటిఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ముల. తాజాగా ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన విడుదల చేసింది చిత్ర యూనిట్. 


ఈ చిత్రంలో నాగ చైతన్యకి జోడీగా మలయాళ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. ‘ఫిదా’ చిత్రంలో అద్భుతమైన నటన కనబరచిన సాయి పల్లవినే మరోసారి రిపీట్ చేస్తున్నారు శేఖర్ కమ్ముల. ఆగష్టు మొదటి వారం నుండి ఈ మూవీ రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: