ఈవారం విడుదల కాబోతున్న ‘కల్కి’ మూవీతో తిరిగి తన కెరియర్ స్పీడ్ అందుకుంటుంది అని రాజశేఖర్ పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ఈనమ్మకానికి తగ్గట్టుగా ఈమూవీ పై ప్రీ పాజిటివ్ టాక్ ఉండటంతో ఈమూవీని ప్రమోట్ చేస్తూ రాజశేఖర్ అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఈమూవీ పై అంచనాలు పెంచుతున్నాడు. 

ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈమూవీ ప్రమోషన్ కు సంబంధించిన మీడియా మీట్ కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈఫంక్షన్ లో రాజశేఖర్ మాట్లాడుతూ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. వాస్తవానికి తనకు ఇద్దరు కూతుళ్ళు అయినా తన జీవితంలో తాను ఎప్పుడు బాధ పడలేదనీ కామెంట్స్ చేసాడు. 

అయితే రాజకీయాల బాటపట్టి 9 సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరమై తిరిగి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో చిరంజీవి హీరోగా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పుడు ఆ మూవీని రామ్ చరణ్ నిర్మించడమే కాకుండా ఆ మూవీని అతి సమర్ధవంతంగా ప్రమోట్ చేసి చిరంజీవికి రికార్డులు క్రియేట్ చేసిన చరణ్ సమర్ధత పై రాజశేఖర్ ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు   అలాంటి కొడుకు తనకు లేకపోయాడే అన్న బాధను పొందానని అంటూ తన పై తానే కామెంట్ చేసుకున్నాడు. అయితే తన కూతుళ్ళు తనకు కొడుకులు లేని లోటును తీరుస్తూ ‘కల్కి’ సినిమాని ఒక సవాలుగా తీసుకుని నిర్మించడమే కాకుండా తన కెరియర్ లో గొప్ప సినిమాగా మార్చదానికి వారు పడ్డ కష్టం తనకు తండ్రిగా ఎంతో ఆనందం కలిగించింది అంటూ రాజశేఖర్ తన కూతుళ్ళ పై ప్రశంసలు కరిపించాడు.

గతంలో తనను టాప్ హీరోల స్థాయికి తీసుకువెళ్ళిన కోడిరామకృష్ణ ముత్యాల సుబ్బయ్య రవిరాజా పినిశెట్టి లాంటి దర్శకుల స్థాయిలో ఇప్పుడు తనకు క్రియేటివ్ డైరెక్టర్స్ ప్రవీణ్ సత్తార్ ప్రశాంత్ వర్మలు దొరకడం తనకు ఇప్పుడు అదృష్టంగా మారింది అంటూ కామెంట్స్ చేసాడు. తన కూతుళ్ళు ఫినిష్ అయిన ఈ సినిమాను పూర్తిగా చూడమని చెప్పినా తాను కేవలం మూడు రీళ్ల సినిమా చూసి ఆతరువాత ఈమూవీ చూడలేదనీ తాను చూసిన ఆ మూడు రీళ్ళ సినిమాతోనే ఈమూవీ ఎలాంటి అఖండ విజయం సాధించబోతోందో తనకు తెలుసు అంటూ రాజశేఖర్ పెంచుకున్న అంచనాలు ఎంత వరకు నిజం అవుతాయో ఈవారంలో తేలిపోతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: