మహేష్ విజయశాంతి అత్తా అల్లుళ్ళ కాంబినేషన్ తో రాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ షూటింగ్ ప్రారంభం కాకుండానే ఈమూవీని అత్యధిక రేట్లకు బయ్యర్లకు అమ్ముతూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. విజయశాంతి చాల గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాల వైపు యూటర్న్ తీసుకోవడంతో ప్రస్తుతం ఆమె హాట్ టాపిక్ గా మారి అనేక మీడియా సంస్థలు ఆమెతో ఇంటర్వ్యూలు చేస్తున్నాయి.

ఇలాంటి పరిస్థుతులలో విజయశాంతి తన వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు షేర్ చేస్తూ మహేష్ తో తాను నటిస్తున్న సినిమా కథ గురించి అదేవిధంగా ఆమూవీలోని తన పాత్ర గురించి లీకులు ఇస్తోంది. ఈమూవీలో తన పాత్ర నెగిటివ్ షెడ్ తో ఉంటూ మహేష్ తో సరిసమానంగా నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతుంది అంటూ ఈమె ఇస్తున్న లీకులు అన్నీ మహేష్ దృష్టికి వెళ్ళినట్లు టాక్. 

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న టాప్ హీరోల సినిమాల కథల గురించి అందులోని ట్విస్ట్ లు గురించి ముందుగా తెలిసిపోతే ఆమూవీ పై క్రేజ్ తగ్గిపోతోంది. దీనితో ఎలర్ట్ అయిన మహేష్ విజయశాంతికి ఈమూవీ దర్శకుడు అనీల్ రావిపూడి ద్వారా సున్నితమైన హెచ్చరికలు ఇప్పించినట్లు టాక్. 

గతంలో విజయశాంతి హీరోయిన్ గా నటించే ఆనాటి పరిస్థుతులు ఇప్పుడు లేవనీ సినిమా నిర్మాణంలో ఉండగానే ముందుగానే ప్రేక్షకులు ఆమూవీ ఆకథ పై ఊహాగానాలు చేస్తున్నారని అందువల్ల ముందుగానే కథలోని కీలక పాయింట్స్ ముందుగా అందరికీ తెలిసిపోతే ఆమూవీ పై ఆసక్తి తగ్గిపోతుంది అని అనీల్ రావిపూడి విజయశాంతికి హెచ్చరికలు ఇచ్చినట్లు టాక్. దీనితో ఈమె తాను భవిష్యత్ లో ఇచ్చే మీడియా ఇంటర్వ్యూలలో ఈమూవీ కథ గురించి తానేమీ మాట్లాడకుండా కన్ఫ్యూజన్ కొనసాగిస్తాను అంటూ రాములమ్మ ప్రామిస్ చేసినట్లు తెలుస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: