తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంజలి. తెలుగులో "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు", "బలుపు" ,మసాలా" లాంటి చిత్రాల్లో నటించింది.అయితే గత కొంతకాలంగా ఆమె కిడ్నాప్‌కై ఓ ముఠా ప్లాన్ చేస్తోందట. కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఈ విషయం అంజలియే స్వయంగా చెప్పింది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ లేటెస్ట్ మూవీ 'సిందుబాద్‌'.

 

ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా నటించింది. ఈ మేరకు ఓ ప్రముఖ మీడియాతో ముచ్చటించిన అంజలి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.  విజయ్‌ సేతుపతితో ఆమెకిది రెండో సినిమా. ఈ చిత్రంలో హీరో విజయ్‌ సేతుపతితో పాటు ఆయ‌న కొడుకు కూడా నటించడం జరిగింది. ఈ సినిమా విశేషాలను పంచుకున్న అంజలి.. ఈ చిత్రంలో తనను ఓ ముఠా కిడ్నాప్‌ చేస్తుందని, వారి వద్ద నుంచి హీరో విజయ్‌సేతుపతి ఎలా తనను కాపాడారన్నదే చిత్ర కథాంశమని చెప్పింది.

 

అయితే అనివార్య కారణాలతో ఆగిపోయిన సింద్‌బాద్‌ చిత్రం విడుదల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.ఇక అంజలి నటిస్తున్న ఇతర సినిమాల విషయానికొస్తే.. మాధవన్‌, అనుష్క హీరోహీరోయిన్లుగా రాబోతున్నసైలెన్స్ సినిమాలో అంజలి ముఖ్య పాత్రలో దర్శనమీయనుంది. అదేవిధంగా తమిళంలో రెండు చిత్రాలు, తెలుగులో మరో చిత్రంలోను నటిస్తోంది.

 

ఇక పెళ్ళి గురించి తరచు అడుగుతున్నారని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవని, దానికి ఇంకా చాలా సమయం ఉందని తాజాగా జరిగిన ఈ సమావేశంలో చెప్పుకొచ్చింది అంజలి.  అదేవిధంగా రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలు కూడా తనకు అస్సలు లేవని తేల్చిచెప్పింది. తెలిసిన పని మాత్రమే చేయాలి తప్ప తెలియని పనులు చేయకూడదనేది తన సిద్ధాంతమని పేర్కొంది ఈ రాజోలు చిన్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: